అందరికీ సకల శుభాలు కలగాలి మంత్రి ఆనం

0
167

*తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*

 

*అందరికీ సకల శుభాలు కలగాలి*

 

*రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*.

 

నెల్లూరు, జనవరి 13: తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సకల శుభాలు అందించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. 

 

భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని మంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి అన్నదాతలు పాడి పంటలు,బోగ భాగ్యాలు,సిరి సంపదలతో తుల తూగాలని, అందరి కుటుంబాలలో ఆనందం వెల్లి విరియాలని రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 

 

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపై, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు-

 

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ...
By Mobbu Venkatramana 2026-02-05 14:17:47 0 430
Andhra Pradesh
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది....
By Boiena Rajesh 2026-04-09 01:11:10 0 125
Andhra Pradesh
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర...
By Pagadala Venkateswar 2026-05-11 06:30:12 0 59
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 130
Telangana
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
By Sidhu Maroju 2025-07-20 14:34:23 0 975
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com