విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య 

0
127

విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య  విట్ తో విజిఆర్ యం విద్యాసంస్థ  అనుసంధానం  బాపట్ల విద్యార్థులకు మరో కానుక 

బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల: విద్యార్థుల ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు వారధి ఇంటర్మీడియట్ విద్య అని, సరైన ప్రణాళిక,  క్రమశిక్షణ తోడైతే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. 

బాపట్లలోని విజిఆర్ ఎం విద్యా సంస్థ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు మరియు విట్ జూనియర్ కళాశాలతో అనుసంధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ... 
బాపట్ల ప్రాంతానికి ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకును తీసుకువచ్చిన ఘనత విజిఆర్ఎం విద్యాసంస్థకే దక్కిందని, మళ్లీ రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు  సాధించి బాపట్ల ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. 

అంకితభావం క్రమశిక్షణకు మారుపేరుగా వి జి ఆర్ ఎం విద్యాసంస్థ నిలిచిందని,  ఐఐటి, జేఈఈ,  ఎంసెట్ పరీక్షలలో ఉన్నత ర్యాంకుల సాధనలో ఎంతో అనుభవం కలిగిన విట్ జూనియర్ కళాశాల వారితో అనుసంధానం కావడం శుభ పరిణామం అన్నారు. 

బాపట్ల ప్రాంత పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సాధారణ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు ధీటైన విద్యను అందిస్తున్న వీజీఆర్ఎం విద్యాసంస్థల పనితీరు ప్రశంసనీయమని అభినందించారు. 

వి జి ఆర్ ఎమ్ కళాశాల డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ..   బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా విట్ జూనియర్ కళాశాలతో అనుసంధానం జరగడం తమకు శుభశకునంగా అదృష్టంగా భావిస్తామన్నారు. 

2013లో ఆవిర్భవించిన తమ విద్యాసంస్థ గడచిన 12 సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ సహా,  అనేక రాష్ట్రస్థాయి ర్యాంకులను బాపట్ల బాట పట్టించిన తమ కళాశాల విట్ విద్యాసంస్థల అనుబంధంతో రాబోయే రోజులలో ఐఐటి, జేఈఈ,  ఎంసెట్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులను సాధించి బాపట్ల ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నూతన సంవత్సర శుభవేళ తమ కళాశాల తీసుకున్న నూతన అనుసంధాన నిర్ణయం ద్వారా మరింత పురోగతిని నమోదు చేసి, మరొక్క మారు తమను తాము నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

విట్టు విద్యాసంస్థలో అధ్యాపక వర్గం గురించి చెప్పాలంటే రాష్ట్రస్థాయిలో అనేక పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు మెటీరియల్ ను, సిలబస్ ను  రూపొందించి ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన వారని, అలాంటి నిపుణుల శిక్షణ పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో విట్ విద్యాసంస్థ తరపున కేఎస్ఆర్,  డిఎస్ఆర్, రాఘవ, విజిఆర్ఎం తరఫున డైరెక్టర్లు అంబటి గిరిధర్ కుమార్ ఆదెళ్ళ విజయ్ కుమార్ ఇంకా బాపట్ల పరిసర ప్రాంతాల నుండి వివిధ విద్యాసంస్థల పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
By Pagadala Venkateswar 2026-01-28 10:12:41 0 38
Andhra Pradesh
మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ...
By Pagadala Venkateswar 2026-02-19 06:26:06 0 23
Telangana
అటవీశాఖ అర్బన్ పార్క్ లో కోతుల ఆహారపు కేంద్రం ఏర్పాటు.
 మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో వున్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల...
By Gangaram Rangagowni 2026-01-12 09:02:42 0 239
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 385
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com