12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
330

ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2025.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గంలోని 1420 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ లను మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన బుధవారం లబ్దిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందన్నారు. భారీగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

 

పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత.

 

నూతన ఏడాదిని పురస్కరించుకుని మైలవరం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, మిఠాయిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు బుధవారం అందజేశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వారంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 80
Andhra Pradesh
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని...
By Chennaiah Kati 2026-02-04 06:10:48 0 196
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం
సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం...
By Kothuru Murali 2026-03-06 11:39:25 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com