12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
356

ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2025.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గంలోని 1420 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ లను మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన బుధవారం లబ్దిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందన్నారు. భారీగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

 

పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత.

 

నూతన ఏడాదిని పురస్కరించుకుని మైలవరం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, మిఠాయిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు బుధవారం అందజేశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వారంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 18:34:16 0 269
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22)...
By Pagadala Venkateswar 2026-03-02 07:40:46 0 122
Bharat Aawaz
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day The power to build a society and the wisdom to guide the future lie with...
By Bharat Aawaz 2025-09-05 07:16:51 0 849
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com