అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటి పోతున్న ఇన్ఫ్లుయెన్సెర్

0
178

అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటిపోతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్‌

 

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ సంస్కృతి వేగంగా విస్తరించింది. కానీ కొంత మమంది భావ ప్రకటనా స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం సమాజానికి ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. భారత రాజ్యాంగం మనకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది, కానీ అది పరిమితులు లేనిది కాదు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నప్పుడు, వారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై, ముఖ్యంగా యువతపై బలమైన ముద్ర వేస్తుంది. కేవలం వ్యూస్ కోసం, సంచలనం కోసం దేశ ప్రతిష్టను దిగజార్చడం లేదా మతపరమైన మనోభావాలను గాయపరచడం చేస్తున్నారు. సమాజాన్ని కించ పరుస్తున్నారు.

 

విలువల కంటే క్లిక్ బేట్ కే ప్రాధాన్యత:

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటెన్షన్ ఎకానమీ నడుస్తోంది. అంటే ఎవరికైతే ఎక్కువ అటెన్షన్ వస్తుందో వారికి అంత ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దేవుళ్లను కించపరచడం లేదా వ్యవస్థలను తప్పు పట్టడం , వావి వరుసలు లేని జోకుల ద్వారా త్వరగా పాపులారిటీ సంపాదించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ షార్ట్ కట్ పద్ధతి వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. విద్వేషం పెరగడమే కాకుండా, తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. బాధ్యతాయుతమైన ఇన్‌ఫ్లుయెన్సర్లు సమాజానికి దిశానిర్దేశం చేయాలి కానీ, దారి తప్పించకూడదు.

 

చట్టాలు వర్తిస్తాయి !

 

సోషల్ మీడియా అంటే చట్టాలకు అతీతమైన ప్రపంచం కాదు. ఐటి చట్టం , కొత్తగా వస్తున్న డిజిటల్ మీడియా నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమాధికారానికి, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కోర్టు మెట్లు ఎక్కడం, వారి అకౌంట్లు డిలీట్ అవ్వడం మనం చూస్తున్నాం. వ్యక్తిగత ఎదుగుదల కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అది సమాజ క్షేమానికి వ్యతిరేకంగా ఉండకూడదు. నా అన్వేషణ..అన్వేష్ ఒక్కడే కాదు.. చాలా మంది ఉన్నారు.

 

వీక్షకుల బాధ్యత కూడా ముఖ్యం

 

ఇన్‌ఫ్లుయెన్సర్ల దారి తప్పడానికి వీక్షకులు ఇచ్చే ప్రోత్సాహం కూడా ఒక కారణం. వివాదాస్పద కంటెంట్‌ను చూసినా, షేర్ చేసినా వారికి మరింత బలం చేకూరుతుంది. సమాజానికి మేలు చేసే, జ్ఞానాన్ని పంచే వ్యక్తులను ఆదరించడం ,తప్పుడు దారిలో నడిపించే వారిని డిజిటల్ బాయ్ కాట్ ద్వారా తిరస్కరించాలి. అలా చేస్తే సోషల్ మీడియాలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురాగలం. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ తన కెమెరా ముందు మాట్లాడే ముందు, తన మాట లక్షలాది ఇళ్లలోకి చేరుతుందనే కనీస సామాజిక బాధ్యతను గుర్తించాల్సి ఉంది. సోషల్ మీడియా యుగంలో విలువల్ని కాపాడుకోవడం చాలా కష్టం. కానీ అదే కారణంతో అన్నీ తెంపేసుకుని రోడ్డు మీద పడిపోకూడదు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా... కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి...
By Hari Krishna 2026-01-01 16:08:27 0 193
Andhra Pradesh
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ మై టిడిపిని విస్తృతంగా డౌన్లోడ్ చేయించడం జరిగింది
రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల...
By Benguluri Madhubabu 2026-03-05 08:18:27 0 151
Andhra Pradesh
హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
Iran       *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన...
By Rajini Kumari 2026-04-13 08:04:00 0 76
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
By Pagadala Venkateswar 2026-02-11 07:56:06 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com