రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే!! కర్నూలు జిల్లా ఎస్పీ

0
144

కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)

50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్  కానిస్టేబుల్ చిన్న సుంకన్న

అభినందించి శాలువతో సన్మానించిన... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు. 

రక్తదానం... ప్రాణ దానంతో సమానం... సేవా భావంతో పని చేయడం అభినందనీయం...జిల్లా ఎస్పీ

రక్తదానం చేయడం అంటే  ప్రాణదానం చేయడం లాంటిదని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు. 

కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  చిన్న సుంకన్న  50  సార్లు  రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం అభినందించారు. 

శాలువ , పూల మాలతో సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. 

పోలీసు శాఖలో  విధులు నిర్వహిస్తూ , సేవాభావంతో  రక్తదానం చేయడం  అభినందనీయమని జిల్లా ఎస్పీ  గారు  కొనియాడారు.

2011 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్. స్వస్ధలం కర్నూలు , బుధవారపేట . 

ఈయన కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుండి ఎవరైనా అత్యవసర సమయములలో పోలీసులకు ,ప్రజలకు, గర్భవతులకు వివిధ సమస్యలతో హాస్పిటల్స్ చేరిన వారికి  వెంటనే స్పందించి రక్తదానం చేయడమే కాక అనేక మందిని రక్తదాతలుగా ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్ , కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎవరు సైకోనో తెలుగు ప్రజలందరికీ తెలుసు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్.....
వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి.....   మార్కాపురం...      ...
By mahaboob basha 2025-09-28 13:59:14 0 252
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 95
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 144
Andhra Pradesh
తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు ప్రమాదం ముగ్గురికి స్వల్ప గాయాలు...
 చీరాల:  చీరాల మండలం జాతీయ రహదారి–216పై తోటవారిపాలెం సమీపంలో తెల్లవారుజామున కారు...
By Gadiyapudi Narendra 2026-02-11 16:19:04 0 107
Andhra Pradesh
కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జీ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌గూడూరు పట్టణంలో ర‌చ్చ‌బండ‌- కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌
మ‌న పిల్ల‌ల వైద్య విద్య కోసం వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్...
By mahaboob basha 2025-11-20 23:46:34 0 399
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com