అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే

0
288

*తెలుగు రాష్ట్రాల 

అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*

 

 

 

అమరావతి

******

 

 

 

రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి.. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు

 

 

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదిత

 

కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటన

 

 

 

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియకు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభ మై తుది నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. దీంతో, 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్‌ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి రానున్నాయి.

Search
Categories
Read More
Telangana
సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్...
By Sidhu Maroju 2025-09-17 15:09:28 0 305
Andhra Pradesh
చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు టౌన్ లో వైయస్సార్ సర్కిల్, శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా, మరియు సోమేశ్వర సర్కిల్ లో...
By Boya Dasthagiri 2026-04-13 08:54:54 0 167
Media Academy
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism Choosing A Career In Journalism Is A Decision To Serve...
By Media Academy 2025-04-28 19:25:11 0 3K
Andhra Pradesh
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
By Pagadala Venkateswar 2026-02-17 05:25:18 0 177
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 478
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com