ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

1
235

హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ :

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా వెంటనే SIR ఫారాన్ని నింపి స్థానిక BLOకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.

 

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఆకుల రాము, యువ న్యాయవాది చిట్టిపోతుల రమేష్, BLO ఆకుల రజని, RP పులి సుధాలు 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా SIR ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వారు కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
Tumme Amo, IPS: A Journey of Courage and Public Service
The Journey Begins  A Police Leader Dedicated to Public Safety Every successful police...
By Fathima Safa 2026-07-22 11:38:51 0 19
Telangana
నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International...
By Sadaq Sadaq 2026-06-28 09:49:15 0 127
Andhra Pradesh
పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...
By Kothuru Murali 2026-06-23 14:40:37 0 58
Telangana
కరీంనగర్ : ఈనెల 16న జాబ్ మేళా..!
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా...
By Sunka Santhosh 2026-04-11 05:06:54 0 206
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమి వైభవం.. సప్తవాహనాలపై మలయప్ప స్వామి.
Andhra   Ratha Saptami Celebrations in Tirumala  తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-01-25 06:18:00 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com