యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.

0
52

 

యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు

20-06-2026 Sat 15:15

Andhra

Chandrababu Naidu will work with Baba Ramdev to spread Yoga says CM at Undavalli Caves

ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు

యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి

హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు

టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే, ఇప్పుడు అమరావతిని 'హైదరాబాద్ ప్లస్'గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

 

"సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో, అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తాం" అని అన్నారు.

 

టెక్నాలజీని అనుసంధానిస్తూనే, అమరావతిని ఒక నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఒక్కటే సంపదను సృష్టించదని, భారతదేశానికి ఉన్న అసలైన శక్తి సంస్కృతి, ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 172
Andhra Pradesh
మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక.
మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక 10-04-2026 Fri 16:56...
By Pagadala Venkateswar 2026-04-10 12:18:11 0 106
Andhra Pradesh
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం... మార్కాపురం: మార్కాపురం జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:11:15 0 254
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 203
Telangana
తన గురువు డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి...
By Ponnala Srinivasrao 2026-03-28 01:52:43 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com