14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్

0
153

*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం*

*14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని నిరుపేద మహిళకు ఉచితంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*++++*

           కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి క్రమం తప్పకుండా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. 

 

సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లోని పటమట రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు. డివిజన్‌లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన గణేషుల పార్వతికి జీవనోపాధి నిమిత్తం రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో కోనుగోలు చేసి అమెకు ఉచితంగా అందచేశారు.  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్ళి క్రమం తప్పకుండా ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీ సెలవు రోజు అయితే ముందు రోజునే ఫించన్లు అందచేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఒక రోజులోనే నూటికి నూరు శాతం పింఛన్లను సచివాలయ ఉద్యోగుల అందచేస్తున్నారని చెప్పారు. పురుషులు సంపాదించిన సొమ్మును ఇంటి ఖర్చులకు కాకుండా వారి వ్యక్తిగతంగా చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారని, అందువల్ల మగవాళ్ళ అలవాట్లలో మార్పులు రావాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్ముతోనే కొంత మంది మహిళలు ఇంటి ఖర్చులను నిర్వహిస్తున్నారని, అందువల్ల మద్యానికి బానిసలు కాకుండా పురుషులు ఇంటి నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపగలమని అన్నారు. పురుషులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి అండగా ఉంటూ పేదరికం నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్ణ రమేష్, పోతంశెట్టి నాగేశ్వరరావు, యడ్లపల్లి నాగరాజు, గరికపాటి బద్రి, డాంగే కుమారి, రామాయణపు సాంబయ్య, రేపాకుల ప్రసాద్, చిట్టా నిర్మల, షేక్‌ ఫాతిమా, పొట్లూరి రవీంద్ర, పోతిరెడ్డి వెంకట్రావ్, వెంకన్న, కెల్లా రమేష్‌ నాయడు, వీర్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్ నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
By Pagadala Venkateswar 2026-06-16 13:20:28 0 63
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 15:34:37 0 432
Telangana
రాజాపేట లో రాజీవ్ గాంధీ కి ఘన నివాళి
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 21-05-2026గురువారం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారత...
By Pindikura Mahesh 2026-05-21 17:42:08 0 152
Andhra Pradesh
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు
ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి...
By Benguluri Madhubabu 2026-06-16 10:57:00 0 106
Tamilnadu
Healthcare Infrastructure Expansion Across Tamil Nadu
Tamil Nadu is strengthening its healthcare system through major investments in hospitals, medical...
By Fathima Safa 2026-06-20 06:39:49 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com