స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.

0
30

కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం

ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

 

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళలో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం...
By Chennaiah Kati 2026-01-28 04:46:58 0 152
Andhra Pradesh
Yekuntadwara Dharshanam
💥వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సమేతంగా మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి...
By Pagadala Venkateswar 2025-12-30 07:59:44 0 224
Andhra Pradesh
మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం...
By Vadlamudi NagaVenkat 2026-03-06 14:51:55 0 561
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 149
Andhra Pradesh
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-04-06 04:43:21 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com