"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!

0
246

హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నూతన విధానం ప్రకారం రహదారులపై, నో-పార్కింగ్ జోన్లలో అడ్డగోలుగా నిలిపే వాహనాలతో పాటు, అకస్మాత్తుగా పాడైపోయి రోడ్డుపైనే ఉండిపోయే బ్రేక్‌డౌన్ వాహనాలను కూడా అధికారులు వెంటనే టోయింగ్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక యార్డులకు తరలిస్తారు. 

అలా స్వాధీనం చేసుకున్న వాహనాలను ముప్పై నుండి నలభై ఐదు రోజుల లోపు యజమానులు అన్ని రకాల బకాయిలు చెల్లించి క్లియిమ్ చేసుకోకపోతే, ప్రభుత్వం ఆ వాహనాలను నిస్సంకోచంగా బహిరంగ వేలం వేసి విక్రయిస్తుంది.

అయితే అధికారులు పట్టుకున్న వాహనాన్ని తిరిగి సొంతం చేసుకోవడం వాహనదారులకు అంత సులువు కాబోదు. సదరు యజమాని జరిమానాతో పాటు వాహనాన్ని తరలించినందుకు అయ్యే టోయింగ్ ఛార్జీలను, యార్డులో భద్రపరిచినందుకు గానూ రోజువారీ పార్కింగ్ ఫీజులను కూడా భరించాల్సి ఉంటుంది. 

వీటితో పాటు సదరు వాహనంపై గతంలో ఉన్న అన్ని పాత ఈ-చలాన్లను పూర్తిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు టాక్స్ బకాయిలు చెల్లించి, ప్రస్తుతానికి చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను అధికారులకు సమర్పించిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తారు. 

ఈ విధానం వల్ల భవిష్యత్తులో సొంత పార్కింగ్ స్థలం ఉన్నవారికే వాహనాలు కొనుగోలు చేసే అర్హత లభించేలా నిబంధనలు మారనున్నాయి.మరోవైపు ప్రభుత్వం కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్‌ వంటి ప్రధాన రద్దీ ప్రాంతాల్లో, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలతో కూడిన మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని యోచిస్తోంది. 

ప్రస్తుతం రవాణా శాఖ సిద్ధం చేసిన ఈ ముసాయిదా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా చట్టబద్ధంగా అమలు చేయనున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Foxconn Recalls Staff From India
In a setback to Apple’s India expansion plans, Foxconn Technology Group has been sending...
By Bharat Aawaz 2025-07-03 08:16:40 0 3K
SURAKSHA
B. Lakshmi Kantham, IAS: Championing Good Governance Excellence
B. Lakshmi Kantham, IAS: A Distinguished Civil Servant Committed to Transforming Governance A...
By Lokeshwari Panthadi 2026-07-13 13:33:39 0 176
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 318
Uttarkhand
Kedarnath Yatra Resumes While Search Continues for Missing Hiker
Following a brief temporary suspension due to severe weather and fresh snowfall in the upper...
By Tejaswini Komanduru 2026-06-05 09:01:35 0 598
Telangana
సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ...
By Bonagiri RaviShankar 2026-05-22 00:51:35 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com