"సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|

0
119

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఆలయాన్ని నిర్మించిన కురుమ సంఘం ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.

కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో ప్రజలకు సేదతీరడానికి పార్కులు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు దేవాలయాలు ఎంతో అవసరమని, వీటి కోసం ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు.

తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ప్రతి సమస్యపై పోరాడుతానని ఈటల హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఆలయ చైర్మన్ గొరిగి నరసింహ, జనరల్ సెక్రెటరీ తుర్పాతా ఆనంద్, కురుమ సంఘం నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా...
By Avunoori Mahesh 2026-04-13 14:08:05 0 149
Andhra Pradesh
చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-22 09:46:05 0 163
Telangana
రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్
*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ...
By CM_ Krishna 2026-01-13 13:31:15 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com