సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

0
102

సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం

కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫున దాఖలైన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున, ఈ దశలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 

ఈ కేసుకు సంబంధించి నిన్న జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కింది కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని, అందువల్ల పోలీసులు తమ క్లయింట్లను అరెస్టు చేసే అవకాశం ఉందని, వారిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, తమ ముందు ప్రస్తుతానికి అలాంటి సమాచారమేమీ లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను మాత్రమే సస్పెండ్ చేశామని, ఆ ఉత్తర్వులను కొట్టివేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

 

సీఎం చంద్రబాబుపై మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరి, పార్టీ కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను కుప్పం కోర్టు తిరస్కరించగా, దాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 196
Telangana
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
రామాయంపేట మండలం కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం...
By Katiyala JeevanRaj 2026-05-14 12:30:40 0 207
Andhra Pradesh
అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక...
By Pagadala Venkateswar 2026-04-09 04:46:36 0 209
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం...
By Kothuru Murali 2026-03-08 08:33:21 0 157
Andhra Pradesh
Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.
Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా...
By Pagadala Venkateswar 2026-07-14 07:18:25 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com