టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.

0
89

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, వారిలో నూతనోత్సాహం నింపుతున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ పార్టీ శ్రేణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే సమయంలో, పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తున్నారు. 

 

ఈ సందర్భంగా కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' (ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు.

 

పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణా శిబిరాల్లో చంద్రబాబు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ, వారితో నేరుగా సంభాషిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పరిపాలన అంశాలపై తన సుదీర్ఘ అనుభవాన్ని పంచుకుంటున్నారు. గతానుభవాలు, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరుపై కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ స్వీకరిస్తున్నారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్న మనం, క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి. పాజిటివ్ పాలిటిక్స్ చేస్తూ, పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి. గతంలో కంటే టీడీపీ ఓటు బ్యాంకు పెరగాలి,” అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.

 

కార్యకర్తల ఆర్థిక బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సీఎం తెలిపారు. "పార్టీ నేతలు, కార్యకర్తల కోసం E3 ప్రోగ్రాం తీసుకొస్తాం. నీతి, నిజాయతీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 'ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్' కార్యక్రమం చేపడతాం" అని హామీ ఇచ్చారు. “నా కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచించానో, టీడీపీ కుటుంబం కోసం కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాను” అని ఆయన పేర్కొనడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రత్యర్థి పార్టీల తీరును సమర్థంగా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్,...
By Pagadala Venkateswar 2026-03-09 05:44:37 0 161
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 04:44:03 0 107
Telangana
ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే
దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్...
By Ponnala Srinivasrao 2026-03-06 06:06:14 0 353
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com