Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.

0
149

మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

 

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ ఇస్తే, ఆయన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని తప్పని, ఇలాంటి వారి ప్రవర్తన వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురలవాట్లతో పార్టీ పరువు తీసే వారిని మోయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

 

 

 

టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన మహేశ్... మంచి రాజకీయ నేపథ్యం ఉండి కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికే పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులంతా ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

Search
Categories
Read More
Goa
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
By BMA ADMIN 2025-05-21 08:54:16 0 2K
Andhra Pradesh
మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో...
By Pagadala Venkateswar 2026-02-21 11:09:45 0 123
Andhra Pradesh
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.
మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)...
By Shyamala Yadagiri 2026-04-28 00:34:00 0 143
Andhra Pradesh
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి
Meebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్...
By Siva Bhaskar 2025-12-26 01:49:35 0 808
Andhra Pradesh
చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు
పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ...
By Kothuru Murali 2026-01-07 13:06:20 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com