ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

0
451

బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. 
        కలెక్టరేట్ కు వచ్చే ప్రజల కొరకు సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాజిక మరుగుదొడ్లు   నిర్మిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ కార్పొరేషన్ నుంచి రూ.21లక్షలు, డి ఎం ఎఫ్ నిధి నుంచి రూ.9 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రూ.30 లక్షల నిధులతో నిర్మిస్తున్న 20 మరుగుదొడ్లు, 20 యూరినల్స్, సింక్ లు, కొళాయి కనెక్షన్లు, నీటి వసతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, యూరినల్స్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించిన ఆయన  ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు ఉండాలని సూచించారు. భవన సముదాయంలో ఎగ్జిస్టెడ్ ఫ్యాన్లు, వంటి తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భవన సముదాయానికి బోర్డు, ప్రహరీ గోడ వెలుపల వైపు చిత్రాలు వేయించాలని, వారంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ అనంతరాజు, డీఈ, ఎఇ, గుత్తేదారుడు, తదితరులు ఉన్నారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా...
By Chennaiah Kati 2026-07-12 13:14:12 0 61
Telangana
హైదరాబాద్‌లో ఆ రోడ్డు 3 నెలలు బంద్.. ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా...
By Ponnala Srinivasrao 2026-06-30 03:41:32 0 109
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 157
Telangana
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ...
By Sidhu Maroju 2026-03-29 09:09:57 0 235
Andhra Pradesh
బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన...
By Pagadala Venkateswar 2026-02-17 06:14:12 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com