నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*

0
664

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయుటకు విచ్చేసిన బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు.  

షుమారు 10 లక్షల రూపాయలు గ్రామంలో సిమెంట్ రోడ్లు కొరకు అదేవిదంగా మరో 7 లక్షల రూపాయల (షుమారుగా) నిధులను హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించినందుకు ఆ గ్రామ ప్రజా ప్రతినిధిగా గ్రామస్తులు అందరి తరుపున శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు.  

గ్రామభివృద్ధి కోసం నిధులు కేటాయించినందుకు తాండ్ర సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి అని కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి తో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు.  

కార్యక్రమంలో కర్లపాలెం తశీల్దార్ శ్రీదేవి, ఎంపిడిఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపిడిఓ లు శ్రీనివాసరావు,పద్మావతి లు, సెక్రెటరీ షేక్ షాహిన్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి ఆషా అశోక్, టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన గ్రామ పార్టీ ఇంచార్జ్ లు మునిపల్లి చిన్నా, గరిగంటి శ్రీనివాసరావులు, కుంటా రత్న బాబు,తాండ్ర శేషగిరి, బీసాబతుని గోపి, తాండ్ర శ్రీనివాసరావు,మొదలగు గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
Call for Anti-Torture Law Grows Stronger in Tamil Nadu
Tamil Nadu, July 2025: After the tragic custodial death of a security guard in Sivaganga, public...
By Citizen Rights Council 2025-07-29 05:17:40 0 1K
Telangana
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
By Sidhu Maroju 2025-06-19 15:49:39 0 1K
Telangana
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ...
By Veeresh Kumar 2026-03-27 07:40:17 0 205
Andhra Pradesh
కిడ్నీ డే సందర్భంగా టీ షర్ట్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-03-09 17:34:30 0 107
Andhra Pradesh
మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-02-13 06:42:01 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com