గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|

0
135

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రం (IVF Centre) ద్వారా తొలి శిశువు జన్మించింది.

అల్వాల్‌కు చెందిన ఓ మహిళ ఈ అత్యాధునిక చికిత్స ద్వారా మాతృత్వాన్ని పొంది, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చాం) (30) అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం గతంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐవీఎఫ్ సేవల గురించి తెలుసుకున్న ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో ఇక్కడి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు.

 

వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా ఆమె 2 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఫిబ్రవరి 25న వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

 

ఈ అద్భుత విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఐవీఎఫ్ బృందంలోని డాక్టర్ శోభ, డాక్టర్ సుమిత్ర నాయర్, డాక్టర్ ఫాతిమా రాణి తదితరులను ఆయన అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. 

 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను పేదలకు ఉచితంగా అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గాంధీ మరియు పేట్లబురుజు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వరంగల్ మరియు ఆదిలాబాద్‌లకు కూడా వీటిని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మాతృత్వం పొందలేని మహిళలకు ఇది ఒక వరమని  ఆసుపత్రి సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-20 17:57:37 0 45
Andhra Pradesh
విజయవాడ పివిపి మాల్ రోడ్డు విస్తరణ మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థ  24-01-2026        *పివిపి మాల్ రోడ్ విస్తరణ...
By Rajini Kumari 2026-01-25 11:15:19 0 165
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 53 లక్షల విలువైన సెల్ఫోన్లు రికవరీ.బాధితులకు అందించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*//సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న /...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:46:28 0 248
Telangana
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
By Avunoori Mahesh 2026-04-12 12:51:46 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com