మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.

0
120

మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి తమకు నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉందని, అమెరికాలో ఉంటున్న NRI చలపతి నాయుడు ఆ భూమిపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి తమకు న్యాయబద్ధమైన పత్రాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com