బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం

0
163

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం వెంక‌య్య‌ చేసిన సేవలు చిరస్మరణీయం

 

ఐలాపురం వెంక‌య్య కుటంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

వెంక‌య్య కుటుంబానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రగాఢ సానుభూతి

 

 

విజ‌య‌వాడ : ఇటీవ‌ల మృతి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, వ్యాపార‌వేత్త‌, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (96) కుటుంబ సభ్యుల్ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమ‌వారం పరామర్శించారు. దుర్గా ఆగ్ర‌హ‌రంలోని ఆయ‌న నివాసానికి వెళ్లి ఆయ‌న కుమారులు ఐలాపురం రాజ‌, ఐలాపురం అరుణ్ కుమార్ ల‌తో పాటు ఇత‌ర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియపర్చి,ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్బంగా వ్యాపార‌వేత్త‌గా హోట‌ల్ రంగంలో, బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.ఎస్.ఎఫ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-07-01 03:23:14 0 51
SURAKSHA
The Sentinel of the Streets: The Unwavering Journey of Shri K. Narayan Naik
Bridging the Gap Between Governance and the Common Citizen: A Legacy of Integrity, Traffic...
By Kalaga Sailaja 2026-07-14 11:19:58 0 61
Andhra Pradesh
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...
By Rajini Kumari 2025-12-16 07:39:44 0 210
Andhra Pradesh
కల్లూరు ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ట్రాక్టర్
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ఘాట్ రోడ్డులో మామిడికాయల లోడుతో...
By Kothuru Murali 2026-06-25 17:39:38 0 106
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com