• సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు.
    పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.
    ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.
    సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది. ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.
    0 Comments 0 Shares 211 Views 0 Reviews
  • *శరవేగంగా వేములవాడ తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి పనులు*

    *పనులను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు*

    వేములవాడ పట్టణ అభివృద్ధిలో కీలకమైన తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా రాజన్న భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు సాకారం అవుతుండటంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు బ్రిడ్జి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఆదివారం రోజున స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.

    పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

    ఈ బ్రిడ్జి పూర్తయితే వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు, రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అలాగే తిప్పాపూర్, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

    వేములవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తెలిపారు.
    *శరవేగంగా వేములవాడ తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి పనులు* *పనులను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు* వేములవాడ పట్టణ అభివృద్ధిలో కీలకమైన తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా రాజన్న భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు సాకారం అవుతుండటంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు బ్రిడ్జి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఆదివారం రోజున స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు, రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అలాగే తిప్పాపూర్, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. వేములవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తెలిపారు.
    0 Comments 0 Shares 150 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

    కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 వార్డు కొనాయపల్లి కి చెందిన మూడపల్లి నాగరాజు,నీలవ్వ

    సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిక

    భారీగా తరలివచ్చిన 13 వార్డు కొనాయపల్లి ప్రజలు

    కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ భారీ చేరికలు కొనసాగుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 13వ వార్డు కొనాయపల్లికి చెందిన మూడపల్లి నాగరాజు, నీలవ్వతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు…

    ఈ సందర్భంగా కొనాయపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువాలు కప్పి ఆహ్వానించారు…

    ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు…

    రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు…

    పార్టీలో చేరిన మూడపల్లి నాగరాజు, నీలవ్వ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు…
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 వార్డు కొనాయపల్లి కి చెందిన మూడపల్లి నాగరాజు,నీలవ్వ సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిక భారీగా తరలివచ్చిన 13 వార్డు కొనాయపల్లి ప్రజలు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ భారీ చేరికలు కొనసాగుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 13వ వార్డు కొనాయపల్లికి చెందిన మూడపల్లి నాగరాజు, నీలవ్వతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా కొనాయపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువాలు కప్పి ఆహ్వానించారు… ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు… పార్టీలో చేరిన మూడపల్లి నాగరాజు, నీలవ్వ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు…
    0 Comments 0 Shares 133 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు

    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు

    ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం.

    అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు

    అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

    ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 194 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com