పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై విష్ణునారాయణ తెలిపిన వివరాల ప్రకారం, తుమ్మగుంటపల్లె సమీపంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. మరికొంతమంది పారిపోయినట్లు ఎస్సై వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 46,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com