మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి చెందిన రైతు వెంకటరెడ్డి (46) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎం గంగ జాతర చూసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మదనపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తట్టివారిపల్లి బైపాస్ వద్ద ఖుషి డాబా సమీపంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments 0 Shares 36 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com