బోయకొండలో భక్తుల ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు.
బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల ఆటో శుక్రవారం సాయంత్రం కొండపై బోల్తా పడింది. తెనాలి, రేపల్లి, పల్కికోలు, పెరవలి ప్రాంతాల నుంచి కూలి పనుల కోసం కందూరుకు వచ్చిన 13 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com