చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన సబ్బవరపు ఆనంద్ సీలేరు నదిలో మునిగి మృతి చెందారు. మూడు కుటుంబాలకు చెందిన 13 మంది మూడు కార్లలో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో సీలేరు నది వద్ద నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉండగా నీటి...