"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ ఇంచార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి స్థానిక కాలనీల్లో పాదయాత్ర చేపట్టి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన...