మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని మానవత్వం చాటుకున్నారు.
0 Comments 0 Shares 20 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com