మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన హరిబాబు (35) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లెకు వచ్చి, తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిబాబు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
0 Comments 0 Shares 31 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com