కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా కాలిపోగా మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లో అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలను అదుపు చేయడంతో నష్టాన్ని నివారించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #RAJESH 
0 Comments 0 Shares 292 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com