పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో సీతారాముల చరిత్రను చెబుతూ కళ్యాణం జరిపించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం సీతారాముల విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ 'జై శ్రీరాం' నినాదాలు చేశారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com