బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్
శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
#Boiena Rajesh