ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.

0
50

 

ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్

15-07-2026 Wed 

Andhra

Deputy CM Pawan Kalyan discharged from Mumbai hospital

భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి

కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.

 

గత కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన 'రొటేటర్ కఫ్' సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, చికిత్స నిమిత్తం ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజానికి వైద్యులు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు.

 

పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకొని విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.
  జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ 16-06-2026 Tue  Andhra...
By Pagadala Venkateswar 2026-06-16 13:10:57 0 72
Tamilnadu
నిజామాబాద్:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే...
By Sadaq Sadaq 2026-05-05 16:52:23 0 145
Andhra Pradesh
The Crisis of Underutilized Infrastructure in India’s Primary Education Sector (2024-25)
  NEW DELHI — The Union Ministry of Education has released a comprehensive set of...
By Venugopal Gopal 2025-12-22 16:04:32 2 615
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 643
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com