ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు

0
58

ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు గారు . ఎస్ ఎస్ జి డిఎస్పి కె. శివ పోతురాజు గారు మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్‌ను పరిశీలించి, బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, ప్రజా వేదికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులకు ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం, ఏ ఆర్ డి ఎస్పి కె. శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, చీమకుర్తి సీఐ డి ప్రసాద్, పామూరు సీఐ వినోద్ కుమార్, ఆర్ఐ రమణ రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 264
Telangana
పెద్దపల్లి వేసవి ప్రభావాలు అధిక ఉష్ణోగ్రతలు: వేసవిలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు చేరుకుంటాయి. గత ఏడాది సుల్తానాబాద్ వంటి ప్రాంతాల్లో 44.5°C నమోదైంది.
PEDDAPALLI 
By Sunka Santhosh 2026-03-26 05:45:21 0 297
International
In Dubai all airports are closed due to the war
దుబాయ్‌లో అన్ని విమానాశ్రయాలు మూసివేత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని...
By G k Nookala 2026-02-28 14:53:03 0 352
Telangana
ఆసిఫాబాద్‌: లుంబిని దీక్షాభూమి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునార్ కార్  జగదీష్) ఆసిఫాబాద్: జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-02 16:42:08 0 303
Andhra Pradesh
నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి...
By Patan Khuddus 2026-05-07 10:52:28 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com