ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.

0
65

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి

ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు

మూడు తరాలుగా ఆయనపై గౌరవం తగ్గలేదన్న నారా భువనేశ్వరి

తెలుగుజాతి కీర్తి ఎన్టీఆరేనని స్మరించుకున్న మంత్రి నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఈ మేరకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా తమ స్మృతులను పంచుకున్నారు.

 

 "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ, రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగిన ఆయన, తెలుగు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. "ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. అణగారిన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమానికి చిరునామా అయ్యారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఆ మహామనికి జోహార్లు. తాతా.. మీరే మాకు నిత్య నూతన స్ఫూర్తి" అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.

 

ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కూడా తన తండ్రిని స్మరించుకున్నారు. "మూడు తరాలుగా చూస్తున్నాను. ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా అదే గౌరవం. చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూపించే ఆయన నిబద్ధతే తెలుగువారికి 'అన్నగారిని' చేసింది" అని ఆమె తన పోస్టులో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను, ఆశయాలను కుటుంబసభ్యులు స్మరించుకున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో "స్పెషల్ టీమ్" ను ఏర్పాటుచేసి, కార్మికుల...
By Sadaq Sadaq 2026-06-06 10:16:18 0 123
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 51
Telangana
పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత ...
By Avunoori Mahesh 2026-04-11 17:32:51 0 176
Telangana
అవినీతి విచారణైతే వేటకుక్కలు, మౌనంగా ఉంటే కాపలాకుక్కలా?
ED, IT, CBIలను BJP వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే ఆరోపణ గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు పదేపదే...
By Ponnala Srinivasrao 2026-06-13 01:19:05 0 142
Andhra Pradesh
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
By Boiena Rajesh 2026-03-07 09:42:32 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com