Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.

0
253

గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు

బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు

గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు

 

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో హుటాహుటిన బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.

 

వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. 

 

కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 53 లక్షల విలువైన సెల్ఫోన్లు రికవరీ.బాధితులకు అందించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*//సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న /...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:46:28 0 247
Andhra Pradesh
చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ,...
By Pagadala Venkateswar 2026-03-25 03:01:01 0 134
Arunachal Pradesh
Arunachal’s ₹5 Crore Aid: True Solidarity or Political Show
Arunachal Pradesh CM Pema Khandu announced ₹5 crore aid for #Himachal flood victims, stressing...
By Pooja Patil 2025-09-11 05:47:47 0 187
Sports
FIFTY FOR JAISWAL! 🔥🔥🔥
His seventh 50+ score in just 12 innings against England! 💪 Will he convert this into another...
By Bharat Aawaz 2025-07-02 17:51:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com