Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.

0
252

గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు

బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు

గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు

 

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో హుటాహుటిన బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.

 

వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. 

 

కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-07 12:01:57 0 140
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 128
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com