• కంగ్టి-పిట్లం రోడ్డు మార్గంలో పత్తి విత్తనాలు తీసుకుని వెళ్తూ లారీ కంగ్టి ప్రాంతంలో బోల్తా పడింది. డ్రైవర్ మరియు క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తుర్కవద్గావ్ పత్తి మిల్లు నుండి పత్తి విత్తనాలు తీసుకుని మహారాష్ట్రకు వెళ్తూ కంగ్టి ప్రాంతంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు.
    #kangti #telangana #bharataawaz #kangtipitlamroad
    #laari #accsdent
    కంగ్టి-పిట్లం రోడ్డు మార్గంలో పత్తి విత్తనాలు తీసుకుని వెళ్తూ లారీ కంగ్టి ప్రాంతంలో బోల్తా పడింది. డ్రైవర్ మరియు క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తుర్కవద్గావ్ పత్తి మిల్లు నుండి పత్తి విత్తనాలు తీసుకుని మహారాష్ట్రకు వెళ్తూ కంగ్టి ప్రాంతంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. #kangti #telangana #bharataawaz #kangtipitlamroad #laari #accsdent
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు*

    *•సిఐ వెంకట్ రెడ్డి*

    కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
    కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు.
    #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు* *•సిఐ వెంకట్ రెడ్డి* కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు. #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి 07 మంది పై కేసు
    #telangana #kangti #bheemra #news #bharataawaz
    *పేకాట స్థావరంపై దాడి 07 మంది పై కేసు #telangana #kangti #bheemra #news #bharataawaz
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి*

    కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్)

    *• ప్రజలకు ముఖ్యమైన సూచన*

    *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్*
    *కంగ్టి పోలీస్ స్టేషన్*

    కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి*

    1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి.
    2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి.
    3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి.
    4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.
    5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
    సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్.
    Cl By Ramesh Kangti

    #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews
    #policestation
    *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి* కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్) *• ప్రజలకు ముఖ్యమైన సూచన* *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్* *కంగ్టి పోలీస్ స్టేషన్* కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి* 1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి. 2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి. 3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి. 4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. 5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్. Cl By Ramesh Kangti #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews #policestation
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • *వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయండి*

    *•ఎంఆర్పిఎస్ మండల నాయకులు విజయ్ కుమార్ మాదిగ*

    కంగ్టి,జూలై25,(భారత్ ఆవాజ్ న్యూస్)

    ఈనెల 28న వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కంగ్టి మండల ఎంఆర్పిఎస్ ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ
    ఎమ్మార్పీఎస్ నాయకులు అబ్రహం మాదిగ, బాబు మాదిగ,సీమన్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డికి వస్తున్నారు.మండలాల్లోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు ఒంటరిమహిళలు జిల్లా సన్నాహక సదస్సుకు తరలిరావాలి. వికలాంగులకు 6000 వేల పింఛను,వృద్ధులకు,వితంతువుకు ఒంటరిమహిళలకు 4000 రూపాయలు హెచ్ఐవి బాధితులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు పింఛన్ పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మెనీ పోస్టలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
    #telangananwes #news #kangtinews #newsbhart #online #mrps #madiga #kangtimandal
    *వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయండి* *•ఎంఆర్పిఎస్ మండల నాయకులు విజయ్ కుమార్ మాదిగ* కంగ్టి,జూలై25,(భారత్ ఆవాజ్ న్యూస్) ఈనెల 28న వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కంగ్టి మండల ఎంఆర్పిఎస్ ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు అబ్రహం మాదిగ, బాబు మాదిగ,సీమన్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డికి వస్తున్నారు.మండలాల్లోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు ఒంటరిమహిళలు జిల్లా సన్నాహక సదస్సుకు తరలిరావాలి. వికలాంగులకు 6000 వేల పింఛను,వృద్ధులకు,వితంతువుకు ఒంటరిమహిళలకు 4000 రూపాయలు హెచ్ఐవి బాధితులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు పింఛన్ పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మెనీ పోస్టలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. #telangananwes #news #kangtinews #newsbhart #online #mrps #madiga #kangtimandal
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం*

    కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్)

    లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్
    వారి ఆధ్వర్యంలో
    నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో...
    ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో
    ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును.
    *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం.
    తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము
    ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
    *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు*
    లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్.
    #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం* కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్) లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ వారి ఆధ్వర్యంలో నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో... ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును. *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం. తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు* లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్. #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు*

    కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై

    కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
    #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు* కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    Like
    1
    1 Comments 0 Shares 2K Views 0 Reviews
  • కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు
    సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
    #kangti #bharataawaz #Telangana #rainnwes
    కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. #kangti #bharataawaz #Telangana #rainnwes
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com