నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ అధికారి రాధ తెలిపారు. మండలంలోని వివిధ సొసైటీల్లో 4,330 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందుగానే యాప్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఏఈఓలు, వాలంటీర్లు రైతులకు యాప్పై అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పటికే పలు గ్రామాల్లో యాప్ ద్వారా యూరియా పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
1 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com