నోట్లోనే పేలిన ఛార్జింగ్ లైట్ బ్యాటరీ. ఆసిఫాబాద్ జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుని స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చింతలమానేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన నికోడె గణేష్, శారద దంపతుల కుమారుడైన లోకేష్ అనే పద్నాలుగేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న ఒక పాత ఛార్జింగ్ లైట్ లోని బ్యాటరీని బయటకు తీసి, అది పనిచేయడం లేదనే కారణంతో తన పళ్లతో గట్టిగా...