MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని MB కెనాల్ పై ఇరుకుగా మారిన పాత వంతెన స్థానంలో ఇటీవల కొత్తగా మంజూరైన కోటి రూపాయల నిధులతో ఇరిగేషన్ శాఖ నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ శాఖ ఏఈ మానస దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.
0 Comments 0 Shares 31 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com