రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
రామాయంపేట మండలం కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, హమాలీలు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
0 Comments 0 Shares 209 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com