మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.
0 Comments 1 Shares 585 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com