తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
0 Comments 0 Shares 127 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com