కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
కవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేసిన రహదారి పనులకు సోమవారం మోక్షం లభించింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఈ రహదారి సమస్య తీరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలు మోహనరావు, మణిచంద్రప్రకాశ్, సంతోశ్ పట్నాయక్ కలిసి ఈ పనులకు భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
0 Comments 0 Shares 329 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com