కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ పంపిణీని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలను సకాలంలో అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
0 Comments 0 Shares 957 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com