అనంతనగర్ గురుకులంలో ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
నేలకొండపల్లి మండలం అనంతనగర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 480 మంది విద్యార్థులకు గాను 448 మంది (239 మంది బాలురు, 209 మంది బాలికలు) హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. 32 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్ష సజావుగా సాగిందని వెల్లడించారు.
0 Comments 0 Shares 231 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com