దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర
టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ *బండి రమేష్* గారు ఆదివారం నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ డివిజన్ దిల్ కుష్ నగర్ లో ప్రజా సమస్యలపై విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. కాలనీవాసులు తమ సమస్యలను రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా గతంలో తాము ఐడిపిఎల్ స్థలం రహదారి నుంచి రాకపోకలు సాగించేవారమని అయితే ఇటీవల ఈ రహదారికి అడ్డంగా ఫెన్సింగ్ చేశారని దీంతో తమకు తీవ్ర అసౌకర్యంగా ఉందని వారు ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని ఈ ఫినిషింగ్ తొలగించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు. దీంతోపాటు ఈ కాలనీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజీ నీరు పొంగిపొర్లి రహదారులపై ప్రవహిస్తుందని దుర్వాసన వెలువడుతోందని వెంటనే కొత్తడ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు .కాలనీలో నైట్ ఫ్యాట్రోలింగ్ లేకపోవడంతో అసాంఘిక శక్తులు రెచ్చి పోతున్నాయని ఈ పరిస్థితి కాలనీ ప్రజలుగా తమకు ఇబ్బందిగా పరిణమించిందని వెంటనే పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రమేష్ గారు ఈ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే అధికారులతో మాట్లాడుతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పుష్ప రెడ్డి, శివకుమార్, శ్రీకాంత్ పటేల్, యుగేందర్, ప్రసన్న కుమార్, నరేందర్ ,బాల నరసింహ, సదానందం, ముక్తార్, తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ఆదివారం బాలనగర్ డివిజన్ దిల్ కుష్ నగర్లో విస్తృత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
స్థానికులు మాట్లాడుతూ, గతంలో ఐడిపిఎల్ స్థలం రహదారి ద్వారా రాకపోకలు సాగించేవారమని, అయితే ఇటీవల ఆ మార్గానికి అడ్డంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫెన్సింగ్ తొలగించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు.
అదేవిధంగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ దుర్వాసన వ్యాపిస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక కాలనీలో రాత్రి సమయంలో పోలీస్ నైట్ ప్యాట్రోలింగ్ లేకపోవడంతో అసాంఘిక శక్తుల సంచారం పెరిగిందని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు. వెంటనే పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న బండి రమేష్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
References
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz