-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
Please log in to like, share and comment!
-
కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభరామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. తొలుత ముఖ్యమంత్రి సందేశాన్ని కార్యదర్శి ధనలక్ష్మి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరుపై అధికారులు సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా ఉచిత రేషన్ బియ్యం ను ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే వారి రేషన్ కార్డులు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులురామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్ కొరత వదంతులు నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు భారీ సంఖ్యలో బంకులకు చేరుకొని ట్యాంకులను నింపుకున్నారు. ఎన్నడు లేని విధంగా అర్ధరాత్రి సమయంలోను జనం క్యూ కట్టడం చూసి బంక్ యజమానులు సైతం ఆశ్చర్యపోయారు. అటు ప్రభుత్వం పెట్రోల్ గురించి ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచిస్తుంది.2 Comments 0 Shares 266 Views 0 Reviews1
-
హిందీ పరీక్షకు 100% హాజరురామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
హిందీ పరీక్షకు 100% హాజరురామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.0 Comments 1 Shares 293 Views 0 Reviews
-
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయంరామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. పూర్తిగా కంకర తేలిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డును వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.0 Comments 0 Shares 208 Views 0 Reviews1
-
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంనేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి తెలిపారు.మండల వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారూ. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.1 Comments 0 Shares 935 Views 0 Reviews
-
Warm Welcome to @Katiyala Jeevanraj!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!Warm Welcome to @Katiyala Jeevanraj! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard!0 Comments 0 Shares 246 Views 0 Reviews
More Stories