సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ"

* బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే..

* వైస్ చైర్మన్ గా దార్ల సందీప్.

* విలీన గ్రామాలకు విప్ తో సరి.

.* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం.

* యువతకు ప్రాధాన్యం.

రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం.

భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే.

అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు.

* చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ..

సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు.

* వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్."

మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.

* విలీన గ్రామాలకు విప్ తో సరి..

సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి.

* అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..!

సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే.

_ అల్లే రమేష్. సిరిసిల్ల.
సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ" * బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే.. * వైస్ చైర్మన్ గా దార్ల సందీప్. * విలీన గ్రామాలకు విప్ తో సరి. .* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం. * యువతకు ప్రాధాన్యం. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం. భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు. * చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ.. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. * వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్." మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. * విలీన గ్రామాలకు విప్ తో సరి.. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. * అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..! సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే. _ అల్లే రమేష్. సిరిసిల్ల.
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com