ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం!


అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం?


సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు




హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం! అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం? సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
0 Comments 0 Shares 96 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com