జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు చిత్తూరులోని గిరింపేటకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.